నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !

                                                   

నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! అన్నారు దాశరదీ . ఆ మకుటం మీద ఎంతో మంది కవితలు అల్లారు. పద్యాలు పాడారు. చివరకు మన బ్లాగర్లు కూడా ఆ పేరుతొ  బ్లాగులు ఓపెన్ చేసి తమ పద్య పాటవాన్ని ప్రదర్సిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ  మద్య  ఆంటొణి కమిటీ సోనియమ్మకు సమర్పించిన నివేదిక కానీ , సీమాంద్ర కేంద్ర మంత్రుల కోరికల చిట్టా కానీ , చివరకు సమైఖ్య వాది  ముఖ్యమంత్రి గారు పంపిన రాష్ట్ర నివేదిక కానీ తెలియ చేసేది ఏమిటంటే ,ఖమ్మం జిల్లాలోని భద్రాచలం , నూగుర్ మండలాలు, నల్గొండ జిల్లాలోని మునగాల మండలం గ్రామాలు కేవలం పరిపాలనా సౌలబ్యం కొరకు 1956 తర్వాత తెలంగాణా ప్రాంతాలలో కలిపారు కాబట్టి , గతం లో తెలంగాణా వారు కోరుకుంది కూడా  1956 ముందు తెలంగానే కాబట్టి , రూలు ప్రకారం ఆ ప్రాంతాలను సీమంద్ర లో కలపాల్సి ఉంటుంది అని .

   ఇదే జరిగితే తెలంగాణా తల్లికి కి రెండు పెద్ద గాయాలు అవటం ఖాయం. ఒకటి ఖమ్మం జిల్లా లో భద్రాచలం వద్ద అయితే , రెండోది నల్గొండ జిల్లాలో మునగాల వద్ద . ఎవరైనా డాక్టర్, రోగి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తాడు . కవల పిల్లలకు ఆపరేషన్ చేసి జాగర్తగా పిల్లల్ని విడదీయమంటే , ఒక పిల్ల వాడి అంగాన్ని , ఇంకో పిల్లాడికి అమరచుతాను అనేవాడు వైద్యుడు అవుతాడా ? అలాగే తెలుగు ప్రజలకు ఇబ్బంది లేకుండా తెలంగాణ విడగొట్ట మంటే , సీమాంద్రులు డిమాండ్ చెయ్యని భద్రాచల్లాన్ని , మునగాల మండల్లాలను సీమాంద్ర ప్రాంతంలో కలపటం ఏమిటి? కక్ష సాదింపు దోరణీ  కాక పోతే.
                                                           

ఏది ఏమైనా ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్తితిలోనూ భద్రా చలాన్ని వదులుకోరు. ఖమ్మం జిల్లాలో చాలావరకు సీమాంద్ర సెటిలర్స్ ఉన్నారు. సీమాంద్రా ఉద్యమం మీద వారికి సానుబూతి ఉన్నా, బౌగోళికంగా , మానసికంగా తాము ఎంటో అట్టాచ్ మెంట్ ఏర్పరచుకున్న భద్రాచల రాముడిని వారు వదులుకోరు గాక వదులుకోరు . ఖమ్మం పేరు రావడానికి కారణమయిన "స్తంభాద్రి " కంటే , ఖమ్మం  జిల్లా ప్రజలు "భద్రాచల రాముడినే  " జిల్లా అధికారిక చిహ్నం గా బావిస్తున్నారు. భద్రాద్రి లేని స్తంభాద్రి జిల్లాను కలనైన ఊహించటానికి  ఖమ్మం జిల్లా వాసులు సిద్దంగా లేరు. అసలే దండ కారణ్య  ప్రాంతం . అందులో పిల్లులు కూడా  అవసరమైతే  పులులుగా మారి గాండ్రిస్తాయి. దేనితో ఆటలాడినా పెద్దగా పట్టించుకోక పోయినా దేవుడు సెంటిమెంట్ తో ఆటలాడితే కేంద్రానికి తగిన గుణపాటం చెపుతారు. కాబట్టి కక్ష సాదింపు దోరణిలో కాక సామరస్యంగా విభజన జరపాలని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన