అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు "

                                                                         
 

  తెలుగు జాతి సిగ్గుతో తల వంచుకోవాలి, ఇటువంటి పొలిసు అధికారులను నియమించుకున్నందుకు! స్కాట్లాండ్ లాండ్ యార్డ్ పోలిస్ మాదిరి గొప్ప సాహస పరిశోదనలు చేసి ప్రజలకు న్యాయం చేయమని ఎవరూ అడగటం లేదు కాని , కనీసం పిర్యాదు చేసే వారి మనోబావాలు గుర్తించి , వారికి స్వాంతన కలిగేలా మాట్లాడుతూ , విచారణ చేసే బదులు , వారిని మానసికంగా హింసిoచేలా మాట్లాడుతూ , అదేదో తమ డ్యూటిలో బాగం అని పిలయ్యే పోలిస్ అధికారులను చూస్తుంటే అసలు పిర్యాదు ఎందుకు చేసామా అని అనిపిస్తుంది . ఇండియన్ పోలిస్ వారికీ కొన్ని జనరల్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయట . ఎ దర్యాప్తులోనైన వాటిని పాటించటం ఇండియన్ పోలీసులో భాగమైన తెలుగు నాట పొలిసు వారికీ సహజo అని విజయవాడ కు చెందిన "పటమట లంక" పోలిస్ వారు సెలవిచ్చారట . పాపం ! విరి దర్యాప్తు తీరుకు సాక్షాత్ ఒక మాజీ న్యాయమూర్తి గారే కళ్ళ నీరు పెట్టుకున్నారంటే , వారి దర్యాప్తు విదానం లో ఎంత "పెప్పర్ స్ప్రే " ఉందొ చూడండి . వివరాలు లోకి వెళితే

    విజయవాడ కు చెందిన హిమ బిందు ,సప్తగిరి  బాంక్ మేనేజర్ గారి బార్య . ఆమెకు ఇంజనీరింగ్ చదివే కూతురు , కుమారుడు ఉన్నారు . ఆమె గారు మొన్న పదిహేనో తారీకు నుండి కనిపించటం లెదు. 15 వ తారికున మద్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె భర్తకు ఇంట్లోని బట్టలు , వస్తువులు చిందర వందరగా ఉండటం , బార్య తో పాటు ఇంట్లోని నగలు , బట్టలు కనిపించక పోవటంతో అయన కంగారు పడి అక్కడా , ఇక్కడా వాకబు అనంతరం , తన భార్యను నగల కోసం ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని పోలిస్ కేసు పెట్టడానికి పోలిస్ స్టేషన్ కి వెళితే , పోలీసులు హిమ బిందు గారి క్యారక్టర్ నే అనుమానిస్తూ , పిర్యాదు చేయడానికి వెళ్ళిన వారిని మాటలతో తూట్లు పొడిచారట !. పైగా ఇది దర్యాప్తులో  జనరల్ ప్రాసెస్ అన్నారట . పోనీ అన్న వారేమైనా , ఆ తర్వాత అయినా ఆమె గురించి సీరియస్ గా సెర్చ్ చేసారా అంటే అది లేదు . భర్తని , ఆమె తరపు భండువులని అనుమానిస్తూ కాలం గడి పారు . చివరకు 4 రోజుల తర్వాత ఆమె శవం బందర్ కాలువలో కనపడితే తెల్ల ముఖాలు వేసుకుని పార్మాలిటి లు  పూర్తీ చేస్తున్నారట !.

           స్తానికుల కదనo ప్రకారం హిమబిందు గారు ఉంటున్న ప్రక్క పోర్షన్ లోని యజమానులు ఇంటికి తాళం వేసి ఉంది . వారి కారు డ్రైవర్ ఇంకా కొంతమంది కలసి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి జొరబడి , ఆమెను చంపి నగలు అపహరించి , ఆమె శవాన్ని అపార్ట్మెంట్లలో ఎకడో ఒక చోట కొంత సేపు ఉంచి , రాత్రి వేళా  కాలువలో పడవేసి ఉంటారట . పోలిస్ వారు సకాలం లో స్పందించి , జాగిలాలతో వెతికించి ఉంటె తప్పకుండా హంతకులు పట్టుబడి ఉండే వారట  . హతురాలి వయస్సు , స్తాయిని కూడా పరిగణలోకి తీసుకోకుండా , జనరల్ ప్రాసెస్ పేరుతొ ఆమె బందువుల మనో బావాలను గాయపరచిన పటమట పోలీసులు తీరును గమనించిన మాజీ న్యాయమూర్తి , హిమబిందు గారి మేనమామ గారు అ విషయాన్ని మీడియాకు తెలిపే వేళా ఎలా కన్నీరు పెట్టుకున్నారో చూస్తే ఎవరికైనా మనసు చలించక మానదు.


                                                                

         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన