మట్టికుండ కోసం గొర్రె ని కోసి గోడని కూల్చిన కధ ను గుర్తుకు తెచ్చిన "బోరు బావిలో గిరిజ" ఉదంతం !

                                                                   
     


గత మూడురోజులుగా రంగారెడ్డి జిల్లాలో  మంచాల గ్రామంలో జరుపుతున్న బోరు బావి రెస్క్యూ అఫరేషన్ గమనిస్తుంటె నిజంగా మన అధికారులు ఇంత మానవత్వం ఉన్న వారా అని ఆశ్చర్య పోవాలో లేక ఇంత పాగల్ గాళ్ళా అని నిర్ఘాంత పోవాలో అర్ధం కాకుండా ఉంది. వేల కిలోమీటర్లు దూరం నుండి వేగంగా దూసుకు వస్తున్న హుడ్ హుడ్ తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలిగే అంత టెక్నాలజి ఉన్న మనకు నీరున్న బోరు బావి లో పడిన నాలుగేళ్ల పాప బ్రతికి ఉందా? లేదా ? అని నిర్దారించే టేక్నాలజి లేదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మరి అటువంటి  టేక్నాలజి  ఉండి కూడా మూడు రోజులు రేయింబవళ్ళు, మన ఘనత వహించిన అధికారులు, ఒక మంత్రి గారి పర్యవేక్షణలో 13 జే సి.బి లు ఉపయోగించి  సుమారు ఎకరం భూమిని నాశణం చేసి చివరకు పాప చని పోయిందని సి సి. కెమేరాలు ద్వారా నిర్దారించి చెప్పడమ్ లో గల అంతర్యమ్ ఏమిటి  అనేది అంతుబట్టని విషయమే. వివరాలు లోకి వెళితే
                                                                     

   ఒక తాత, అమ్మమ. . వారికి కొంత భూమి ఉంది. అందులో బోరు వేసారు. నీరు పడలేదని బోరుని వాడటం  లేదట. అయినా దాని మీద ముళ్ళ కంప వేసారు. అయితే వారం క్రితం ఆ ముళ్ల  కంప తీసి వేసార ట . ఒక రోజు తల్లిని కోల్పోయిన తమ కూతురి కోడుకు మరియు  కూతురిని అక్కడికి తీసుకు వెళ్ళి  ఆ బోరు దగ్గర ఆడుకోవటానికి వదిలి వెళ్ళారట. పాపం ఆ ముసల్లి వాళ్ళకి ఆడపిల్ల పెంపకమ్ బారం గా మారుతుందనుకున్నాడొ ఏమో ఆ దేవుడు ఆ పిల్లలో ఆడపిల్లని(గిరిజ ),  మాత్రమే బోరు బావిలో పడెలా చేసాడట. అది చూసిన ఆ పిల్ల అన్న ఆ విషయమ్ తన తాత అమ్మమ్మలకు చెపితే, వారు అధికారులకు సమాచారమ్ ఇస్తే, సదరు అధికారులు మంత్రి గారి పర్యవేక్షణలో  మొన్న అదివారం నుంచి శ్రమించి, తాత గారి ఎకరం భూమి గుల్ల చేసినాకా , పాప చని పోయి నీళ్లల్లో పడి ఉందని తేల్చారట. ఇందులో ట్విస్ట్  ఏమిటంటె పై నుంచి బోరు బావిలోకి టార్చ్ పోకస్ చేసి చూసినా  లోపల నీరు స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే కాకుండా ఒక బక్క పలుచని వ్యక్త్ కాళ్ళకు తాడు కట్టుకుని లోపలకి వెళ్ళగలిగే అంతగా ఉంది ఆ బోరు బావి..  మరి అటువంటి బావిలోకి సి .సి. కెమెరాను పంపి కూడా పాప కన పడటం లేదని చెప్పటం, 5౦ అడుగులు తవ్విన తర్వాత తిరిగి సి.సి. కెమెరా ద్వారే పాప చని పోయి ఉందని నిర్దారించడమ్ చూస్తుంటె ఈ ఆపరేశన్ జరిపించడం వెనుక మానవత్వమ్ ని మించిన మతలబ్ ఏదొ ఉందని అనిపిస్తుంది . ఏదైనా విషయం ఒక పాప ప్రాణం గురించి  కాబట్టి దీనీని ఎవరూ ప్రశ్నించలేక పోవచ్చు. కాని ఈ ఉదంతమ్ లో బాద్యుల నిర్లక్ష్యం , అనవసర హంగామ కు అయిన ఖర్చు, కాలయాపన మీద విచారణ జరిపితే మనకు తెలియని  కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశ ముంది.

   అయితే ఈ ఉదంతం మొత్తం గమనిస్తుంటె, చిన్నప్పుడు నేను చదువుకున్న ఇంగ్లీస్ పాఠం లోని కధ గుర్తుకు వచ్చింది. అధి ఏమిటంటె

   ఒక రైతు ఇంట్లోకి ఒక గొర్రె ప్రవేసించింది. ఆ ఇంత్లో ఒక మట్టికుండలో కొంత దాన్యం ఉంటె దానిని తినాలనుకుని ఆ కుండలొ తల  పెట్టడం తో,  గొర్రె  తల కుండలో ఇరుక్కు పోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ రైతుకి తన గొర్రె తలని కుండ  లోనుండి బయటకు తీసి రక్షించడమ్ ఎలాగో తెలియక చుట్టు ప్రక్కల వారిని పిలిచి సలహా అడుగగా, ఎవరూ ఏమి సలహా ఇవ్వలేక పోవడంతో, ఏమి పాలుపోక కంగారు పడి పోసాగాడు ఆ రైతు. అంతలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపించే ఒక వ్యక్తి ఒంటె మీద వీదీలో వెళుతూ కనిపించగా, అక్కడ చేరిన  వారు ఆ రైతు తో,  ఆ వ్యక్తికి విషయం చెపితే అతను ఉపాయమ్ చెప్పవచ్చు అన్నారు  దానితో ఆ రైతు వీదిలోకి వేళ్ళి ఆ ఒంటే మీద వెళు తున్న వ్యక్తిని తన ఇంట్లోకి వచ్చి తన సమస్యను పరీలించి సలహ చెప్పవలసిందిగా కోరాడు. దానికి ఆ పెద్ద మనిషి " నేను ఒంటె దిగి లోపలకు రాలేను, నేను ఒంటె తో సహా లోపలకు రావాలంటె నీ ఇంటి గోడ అడ్డంగా ఉంది .ఎలా మరి?" అని అనగా , వెంటనే ఆ రైతు మరియు చుట్టు పక్కల వారు గడ్డపలుగులతో రైతు ఇంటి గోడ ను పగుల గొట్టగా, ఠివిగా ఒంటె తో సహ ఇంట్లోకి ఏతేంచిన ఆ వ్యక్తి కుండలో ఇరుకున్న గొర్రె ముఖాన్ని చూసి , " ఒరి పిచ్చోళ్లారా ఇంతోటి  దానికి వేరే ఆలోచించాలా " అని చెప్పి ఒక కత్తిని తీసుకు రమ్మన్నాడు. రైతు కత్తి తీసుకు రాగా దానితో ఒక్క వేటున ఆ గొర్రె తలని నరికి రైతు చేతిలో పెట్టాడు. దానితో ఆ రైతు అమాయకంగా  " మరి కుండలో ఉన్న తల ఎలా స్వామీ అనగా, అదే కత్తి  తో ఒక్క దెబ్బకు కుండను పగుల గొట్టి  గొర్రె తల ను రైతు చేతిలో పెట్టాడు . దానితో   అక్కడ ఉన్న జనం అందరూ హర్షద్వానాలు చేస్తుండగా, సదరు గొప్ప వ్యక్తి తన ఒంటె ఎక్కి చక్కా వేళ్ళి పోయాడు. ఆ రైతుకు చివరకు మిగిలింది ఏమీటంటే పగిలిన కుండ, చచ్చిన గొర్రె, పగిలిన గోడ. అదీ కద

  పై ఉదంతం లో మన అదికారులు చేసిన పని కూడా అచ్చంగా కదలో పెద్ద మనిషి చేసినట్టె ఉంది కధా! ఇదే విషయం మీద మరిన్ని వివరాలకు క్రింది వీడియోను చూడండి .  ఏది ఏమైనా పెద్దల  నిర్లక్ష్యానికి గురి అయి మరణించి న చిన్నారి గిరిజ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ  ........ ....         


                        
                  

                                                         (14/10/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన