Posts

Showing posts from May, 2014

తెలంగాణా రాజ్యానికి ఇదే సరి అయిన అధికారిక చిహ్నం !

                                                                        నూతనంగా ఏర్పడే తెలుగువారి నూతన రాష్ట్రం "తెలంగాణా " కి అధికార చిహ్నం ఎలా ఉండాలి అనే దాని మిద తర్జన భర్జనలు జరగటం , రెండు వర్గాలకు చెందిన ప్రజలు తమ తమ జాతి  గోప్పదనాలను ప్రతిబింబించే చిహ్నాలు ను అధికారిక చిహ్నాలుగా ఉంచాలని కోరడంతో , చివరకు K.C.R గారు ఆ  రెండు వర్గాలు ప్రజలను సంతృప్తి పరచే ఉద్దేశ్యంతో కాకతీయుల తోరణం పెద్దగానూ , చార్మినార్  ను చిన్న గాను , వాటి పైన భారత అధికార చిహ్నం మూడు సింహాల సహిత అశోక చక్రo  తో పాటు త్రిబాష లలో తెలంగాణా పేరు ఉండేటట్లు అధికార చిహ్నానికి ఓ.కే. చెప్పినట్లు తెలుస్తుంది . ఒక లౌకిక రాజకీయ నాయకుడిగా K.C.R గారు చేసింది అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచే చర్యే అయినా , "సూర్యమండలం " గా పేరు గాంచిన కాకతీయ రాజ్య ప్రాంతం అయిన తెలంగాణా రాష్ట్రం కి సూర్యుని చిహ్నం అధికార చిహ్నం లో  లేక పోవడం ఖచ్చితంగా లోటే అని చెప్పవచ్చు .    పూర్వపు  కాకతీయ రాజులు అందరూ సూర్యారాధకులే . అసలు కాకతీయ సామ్రాజ్యO ఆ సూర్య భగవానుడి వర ప్రసాదితం . అందుకే హనుమకొండ వేయి స్తంబాల గుడిలో విష్ణు

సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                              తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు ఇంకా ఉద్యమాల మూడ్ లో నుండి బయటకు వచ్చిన దాఖలాలు కనపడటం లేదు . పై వర్గాలు  తప్పా సామాన్య ప్రజలు సంబురాలు గురించి ఆలోచించటం లేదు . కనీసం యువతకు విద్యా , ఉపాధి, ఉద్యోగ రంగాలలో

పబ్లిక్ లో స్త్రీని హింసించినా లేక స్త్రీ చేత హింసించ బడినా "వెదవ " అయ్యేది మాత్రం మగవాడే ! అని నిరూపిస్తున్న ఈ వీడియోను చూడండి . .

                                                                                       మన దేశం లో గృహ హింస కి బలి అవుతుంది ఎక్కువ శాతం స్త్రీలే అని అందరూ అనుకునేదే ! కారణం స్త్రీలను అనాదిగా ఈ మగ జాతి అణచివేయడం వలన వారిలో అబలత్వం ప్రబలి పురుష బలానికి బలి అవుతుందని సంప్రాదాయ బావన . కాని గృహ హింస కు బలి అయ్యే పురుషులు కూడా తక్కువేమి కాదు మన సమాజంలో . అయినా అటువంటి పురుషుల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంటుంది తప్పా ,బాదిత  స్త్రీల పట్ల  కనపరచిన సానుబూతి ని సమాజం పురుషుల పట్ల చూపదు . మగాడి చేతిలో ఆడది తన్నులు తింటే అ మగాడికి బుద్ది చెప్పటానికి అందరూ సంసిద్దులవుతారు , అదే ఆడదాని చేత మగాడు తన్నులు తింటుంటే అ మాగాడ్ని చూసి నవ్వుకుంటారు తప్పా సీరియస్ గా తీసుకోరు . ఎందుకో తెలుసా ? మగాడు ప్రక్రుతి పరంగానే బలవంతుడు కాబట్టి స్త్రీ చేతిలో తన్నులు తినడమంటే అది వాడి చేత కాని తనం కనుక . కాబట్టి ఎప్పటికి స్త్రీ పురుషులు సమానులు కారు . అది ఇండియాలో అయినా సరే ! ఇంగ్లాండులో అయినా సరే !    ఈ మద్య చేసిన సర్వ్ ల ప్రకారం ఇంగ్లాండులో 40% పురుషులు గృహ హింస బాదితులే నట ! దీనికి కారణ0 స్త్రీలలో వెల్లివిరుస్తున

'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?

                                                                                మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో  భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో  చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద  నోటి కందేదాక  గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు .        గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో జరుగుతున్నా అవక తవకలు గూర్చి సీరియస్ గా చర్చిస్తున్న సందర్బంలో , రాజశేఖర్ రెడ్డి గారు కొంత హేళన గా ప్రవర్తించడం చూసి , అగ్రహోదగ్రులు అయిన చంద్ర బాబు గారు "వెంకటేశ్వర స్వామి విషయంలో  హేళన చేసిన వ

అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?

                                                                              తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ  అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల  చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి  ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం  అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం        శ్రీ చంద్ర శేఖర్ రావు గారు ఎన్నికల వేల అనేక ముఖ్యమైన వాగ్దానాలు చేసారు . అందులో హిందూ సమాజానికి అయన ఇచ్చిన వాగ్దానం తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే , హిందూ సంస్తలకు  ప్రభుత్వ పెత్తన పీడ  నుండి విముక్తి కలిగిస్తా

మెదడు లేని వాడికి ఒక చోట అంటితే , మేదావికి మూడు చోట్ల అంటుద్దన్నట్లుంది యీయన గారి పని !

Image
                                                                            కేజ్రి వాల్ ! డిల్లికి  మాజీ ముక్య మంత్రి వర్యులు . ఈయన  గారికి  కేజ్రివాల్ అనే పేరు కంటే , "క్రేజీ వాలా " అనే పేరు సరిగ్గా సరి పోతుంది !. ఎందుకంటే ఈయన లో పబ్లిసిటి పిచ్చి ఎక్కువ . నిరంతరం ఏదో ఒక కొత్తదనం తో  పనికి రాని పని చేస్తూ నిరంతరం  ప్రజల దృష్టిలో పడాలని తెగ తాప్రతయ పడి  పోతుంటాడు . దానిలో బాగంగానే ఈ  సో కాల్డ్ మేదావి చివరకు అతి తెలివికి పోయి  కావాలని జైలు  పాలయ్యాడు . ఈయన  పిచ్చి తనం చూసిన డిల్లి ప్రజలు ఇటువంటి వాడినా , తాము మేదావి అని బ్రమపడి ఒత్లేసింది అని బాద పడుతుంటే , అయన పార్టి సభ్యులు మాత్రం  ఈ పిచ్చోడి తో లాభం లేదని అమ్ అద్మి  పార్టికి రాజీనామా చేసి వెళ్లి పోతున్నారు .   మన దేశం లో చాలా మంది మేధావులకు జ్ఞానం పుష్కలంగా ఉన్నా , ఇంగిత జ్ఞానం లేక పోవడం వలన ,ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియక అభాసు పాలవుతూ ఉంటారు . అలాంటి వారిలో కేజ్రివాల్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు . భగవంతుడు ఇచ్చిన డిల్లి రాష్ట్ర   ముక్య మంత్రి అవకాశాన్ని , తనకున్న "కొస వెర్రి " బుద్దితో చేజేతుక్లారా

ఏప్రిల్ 15 న నేను కోరుకుంది ,నిన్ననే నిజమైంది !

Image
                                                                                   ఏప్రిల్ 15 న నేను  పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను . దానిలో నా అభిప్రాయాన్ని క్రింది విదంగా తెలిపాను . నా ఆలోచనే కరెక్టు అన్నట్లు గా  తెలుగు ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పును తెలియ చేసారు . దీనితో తెలుగు వారంటే గొర్రెలు అని బావిoచిన  చెళ్ళున చెంప మిద చరచి నట్లైంది . విజ్ఞులు కోరుకున్నట్లు తెలుగు ప్రజలు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించారు . ఇక వారి ఆకాంక్షలు గుర్తించి ,అందుకు అనుగుణంగా పాలనను అందించాల్సిన బాద్యత T.R.S , T.D.P , B.J.P  ప్రభుత్వాల పై ఉంది . యావత్ తెలుగు వారికి అభినందనలతో ......     పేస్ బుక్ లో ఏప్రిల్ 15 న నేను పెట్టిన పోస్ట్ :   తెలంగాణాలొ T.R.S , సీమాంద్రా లో T.D.P., భారత దేశంలో B.J.P అధికారం లోకి వస్తేనే ,రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగే అవకాశముంది . తెలంగాణ లో N.D.A కూటమి అధికారం లోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి , అభివ్రుద్ది మీద అవగాహన లేని తెలంగాణా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టె బదులు , తెలంగాణా ప్రాంత స్వార్దం కోసమే పుట్టిన T.R.S పార్టీ వారికి అధికార

వైద్యురాలి వివాహం "వన్ సైడ్ లవర్ " చేతిలో చావు కొచ్చింది !

                                                                                అందమైన భారతావనిలో అందమైన వనితల  జీవితాలకు భద్రత లేకుండా పోయింది . వారి ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా ప్రేమించి వేయడం , ఆ  ప్రేమలో ఉన్మాదిగా మారడం , తను ప్రేమించిన అమ్మాయి ఎవరినైనా వివాహమాడితే సహించ లేక వారిని పొట్టన పెట్టుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం !ఈ పిచ్చి కుక్కల వలన అడబిడ్డలకు రక్షణ లేకపోతుంటే ఏమి చెయ్యాలి ? మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చె వీది లో తిరుగాడే పిచ్చి కుక్కల్ని కాల్చి చంపినట్లే ఈ ఉన్మాదులను కాల్చి చంపితే తప్పా , అడ పిల్లలకు రక్షణ కలుగదా? అదే నిజమని అనిపిస్తుంది . మొన్న గురువారం భోపాల్ లో జరిగిన దారుణ ఉదంతం తెలియ చేస్తుంది . వివరాలు లోకి వెళితే ,     మద్య ప్రదేశ్ లోని బొపాల్ కి చెందినా జయశ్రీ వృత్తి రిత్యా వైద్యురాలు . ఆమెకు డాక్టర్ రోహిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది . దాని సందర్భంగా భోపాల్ లోని ఒక ఫంక్షన్ హాలులో ఘనంగా  రిసెప్షన్ పార్టి ఏర్పాటు చేసారు . అందరూ ఆనందంగా పార్టి జరుపుకుంటున్న వేళ 'అనురాగ్' అనే వ్యక్తీ వచ్చి జయశ్రీ మిద పిస్టల్ తో కాల్పులు జారి పాడు . అ సంఘటన తో నిర్ఘ

అత్యుత్సాహ D.E.O ఆకస్మిక తనికీ కి వెళితే , రిటైర్డ్ టిచర్ కి షో కాస్ నోటిస్ వెళ్లిందట !

                                                                                      ప్రబుత్వ అధికారుల లీలలకు జార్ఖండ్ రాష్ట్రం ఏమి తక్కువ తినలేదు అనే సంఘటన ఒకటి ఇటివల జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే జిల్లాలో జరిగిoది . దుమ్కా జిల్లా విద్యాశాఖాది గారికి తన ఏలుబడి నిర్వహణలో ఉన్న ఒక స్కూల్ ని ఆకస్మిక తనికీ చేయాలని అనిపించిందట . అంతే !ఎవ్వరికి చెప్పా పెట్టకుండా సదరు స్కూల్ తనిఖి కి వెళ్లారట ! అయితే అక్కడ పిల్లలే కాని స్కూల్ టీచర్లు కనిపించలేదట . దానితో అగ్గి మిద గుగ్గిలమైన D.E.O గారు స్కూల్ రిజిస్టర్ ని తెప్పించుకుని అందులో ఉన్న ఇద్దరు టిచర్ ల వేతనాలు కు కోత విదిమ్చడమే కాకుండా , వారిద్దరిని గైర్హాజరు కారణంగా ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ షో కాస్ నోటిసులు వారిద్ద్దరి ఇళ్ళకు పంపించాడు అట ! అంతే కాకుండా వారిద్దరిపై విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని తన క్రింది అధికారికి హుకుం జారి చేసి వెళ్ళాడట .    అయితే సదరు షో కాజ్ నోటిసులు అందుకున్న ఇద్దరు టీచర్లు అవి చూసి నిర్ఘాంత పోయారట . కారణం వారు అ స్కూల్ ని వదిలి పెట్టి 8 సంవత్సరాలు అయిందట ! అందులో ఒకరు ఉన్నత విద్యార్హత మిద స

దుమ్ము రేపిన ఖమ్మం "విద్యా గన్స్

Image
                                                                            తెలంగాణా ప్రాంతంలో విద్యా పరంగా ఖమ్మం కి ఒక ప్రత్యేకత ఉంది . హైదరాబాద్ ఆంద్ర ప్రదేస్ కి రాజదాని కాబట్టి  ఇంటర్  కాలేజీలలో జరిగే  పరిక్షలలో అక్కడి విద్యార్దులు సాదించే మార్కులు లేక ర్యాంకులు ప్రత్యేకంగా అ ప్రాంతం లోని విద్యార్డులవే అని చెప్పడానికి విలు ఉండదు . అలాగే విజయవాడ కూడా . కాని ఖమ్మం లాంటి నగరాలలో ఇంటర్ చదివే విద్యార్దులు ఎక్కువమంది అ జిల్లాకు చెందినా వారే అయ్యి ఉంటారు . అందుకే ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్దులు ఎ ప్రతిభ కనపరచినా అది ఖచ్చితంగా జిల్లాకే సొంతం అని చెప్పవచ్చు .   నిన్న ఇంటర్ మీడియట్ బోర్డు ద్వితీయ సంవత్సర పరీక్షా పలితాలను తెలిపింది . అందులో MPC విభాగంలో టాప్ 10 లో 8 మందిఅంటే K. నిఖిల్ బాబు , కోటేరు ఆశ ,మిట్టకోలు రోషిత్ ,కొండపల్లి హేమంత్ ,తాళ్లూరి గీతాంజలి ,భువనగిరి పరిచయ ,కోలా లక్ష్మి సాయి మానస ,M .స్వాప్నిక ఖమ్మంజిల్లా  వారే కావడం అ జిల్లాకే గర్వ కారణం . ఇందులో వరుసగా 1 నుండి 7 ర్యాంకులు ఖమ్మానివే .  అలాగే Bi.P.C విభాగంలో కూడా 4,5 ర్యాంకులను ఖమ్మం విద్యార్దులు అయిన రిషబ్ అగర్వాల్ ,

మగాళ్ళు అసబ్యంగా ప్రవర్తిస్తున్నారు అనుకుని జాగర్త పడితే ,ఆడాళ్ళు ఏకంగా దోచేస్తునారు అంట !

                                                                                      ఇది నా మాట కాదు . డిల్లి సెంట్రల్ ఇండస్త్రియల్ సెక్యురిటి పోర్స్ వారి గణాంకాల ఆదారంగా వారు చెపుతున్న మాట . డిల్లి మెట్రో రైళ్ళలో జరిగే పిక్ పాకేటింగ్ తరహా  దొంగతనాల్లో నూటికి 94%దొంగతనాలు మహిళా చోర శిఖామణులు చెస్తున్నవెనట !గత సంవత్సరం డిల్లి మెట్రో రైళ్ళలో మొత్తం 193 దొంగ తనాలు జరిగితే అందులో 175 దొంగ తనాలు స్త్రీలు చేసినవే ! అయితే ఈ  సంవత్సరం వారిలో చైతన్యం ఎక్కవ అవ్వడం వలన , జనవరి నుండి మార్చ్ వరకు మొత్తం 124 దొంగ తనాలు చేస్తే వాటిలో 118 దొంగ తనాలు మహిళా దొంగల ఖాతాలో జమ అయ్యాయి అట ! ఇలా జరగడానికి కారణ మేమిటబ్బా ? అని ఔత్సాహికులు అరా తీస్తే , దానికి కారణం కూడా మగబుద్దే నని తేలిందట !  డిల్లి మెట్రో రైళ్ళలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా "గులాబి రంగు భోగి " లు ఉంటాయట . ఆడాళ్ళు మగాళ్ళు కలిసి ప్రయాణించే జనరల్ కంపార్ట్ మెంట్లో ఎక్కుదామంటే , అందులో "మగ బుద్ది " ప్రదర్సన ఎక్కువుగా ఉంటుందట ! అడాళ్ళను తాకితే చాలు , నరనరాల్లో ద్రిల్ పిలయ్యే పురుష బలహీనులకు జనరల్ కంపార్త్మెంట్లు

పార్టిలో పదవుల కోసం రాష్ట్రాన్ని, పర నారి పెదవుల కోసం సంసారాన్ని విడదిసిన 67 యేండ్ల " పెద్ద మనిషి "

Image
                                                                                                                                                                                                                                                                   అయన గారు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్య మంత్రి . సోనియమ్మ గారి పార్టిలో ఉన్న అతి ముఖ్యులలో ఒకరు .అ  యితే అయన స్వ రాష్ట్రంలో అయన అంటే అయన పార్టి వారికే గిట్టదు . అందుకే ఆయనను రాష్ట్ర పార్టి మీటింగులకు రాకుండా అయన ముఖం మీదే తలుపులు వేసిన సందర్బాలు ఉన్నాయి . అ దెబ్బతో అయన రాష్ట్రం లో ఆయనకు మిగిలిన గౌరవం ఏమి లేదని గ్రహించిన అధిష్టానం , ఆయనకి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు పార్టి  ఇంచార్జ్ గా  నియమిoఛి , ఎలాగైనా సరే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమని ఆదేశించింది . దేనినైనా విడదియడంలో సిద్ద హస్తుడైన అయన , మొత్తానికి అటు చేసి , ఇటుచేసి ఆంద్ర ప్రదేస్ ను రెండు ముక్కలుగా విడదియడంలో సక్సెస్ అయి "శభాస్ రాజా " అని అధిష్టాన దేవత చేత అనిపించుకున్నాడు , ఇది పార్టి పరంగా అయన గారి చరిత్ర .న్ని     అయితే అయన కేవలం ప్రాంతాలను మాత్రమ