పావుగంట పోలిసులు కళ్ళు మూసుకుంటె హిందూ జాతిని నాశనం చేస్తాం అన్నవారికి , చేతికి బేడీలు ఒక లెక్కా ?!!!

                                                                       

                                         
                                      నిన్న MiM పార్టి అధ్యక్షులు జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు , ఒక కరడుగట్టిన ఉగ్రవాదిని డిఫెన్స్ చేసె క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు పత్రికలలో వచ్చింది . వికారుద్దిన్ అండ్ కో ఎన్ కౌంటర్ నిజమా కాదా అనేది దర్యాప్తు చేయమని కోరడం కేవలం ముస్లిం మత ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్న అసదుద్దీన్ గారికి అవసరమై ఉండవచ్చు. భారతీయ పౌరులుగా ప్రతి వారు కోరుకునేది చట్టబద్దమైన పాలన . ఉగ్రవాదులునైనా సరే , "కసబ్ " లూ మాదిరి కోట్లు ఖర్చు పెట్టి , బిర్యానీలు తినిపించి ఉరి తీయాలి తప్పా , వేరొక రకంగా చేయరాదు అనేది భారతీయ ప్రజాస్వామ్య సిద్దాంతం . 3 పోలిసుల హత్యకు కారణం అని చెపుతున్న "వికారుద్దీన్ ది గ్రేట్ " , రెండు నెలలు గడిస్తే తన కుమారుడు నిర్దోషిగా బయట పడేవాడు అని అతని ఘంటా పదంగా ప్రకటించడం చూస్తుంటె , వారికి భారతీయ ప్రాసిక్యుషన్ వ్యవస్థ మీద ఎంత నమ్మక్కమో అర్దం అవుతుంది . తమ వికారపు పైశాచిక చేష్టలతో జన జీవనాన్ని అల్లకల్లోలం చేసే వారికి సౌది లో మాదిరి షరియా చట్టాలే కరెక్టు అని అనిపిస్తుంది .


  అసదుద్దీన్ గారు తన పత్రికా ప్రకటనలో , చేతికి బేడీలు వేసి , సీట్లుకు కట్టేసి ఉన్న వికారుద్దిన్ . తుపాకి ఎలా లాక్కుని పోలిసుల మీద తిరగబడ్డాడు ? అని ప్రశ్నించారు . దానికి రుజువుగా పై చిత్రం లో సీటులో తుపాకితో ఒరిగి ఉన్న వికారుద్దిన్ ,మరియు అతని చేతికి బేడీలు కనిపిస్తున్నాయి . కాని చిత్రం ఏమిటంటె చేతికి ఉన్న బేడి సీటుకు కట్టబడి ఉన్నట్లు కనిపించడం లేదు . మరి అసదుద్దీన్ గారు "సీటుకు కట్టేసిన వ్యక్తులు " అని ఎలా అనగలిగారు? అయినా15 నిమిషాలు పోలిసులు కళ్ళు మూసుకుంటె హిందూ జాతిని నాశనం చేస్తాం అన్నమీ లాంటి వారికి అభిమానులు అయిన వారికి  , చేతికి బేడీలు ఒక లెక్కా  ?!!! పదిహేను నిమిషాలు కళ్ళు ముసుకుంటె కోట్ల మందిని సo హరించగలిగినవారు , ఒక సెకనులో 60 వ వంతు కళ్ళు ముసుకుంటె చాలదా ? తుపాకి లాక్కుని తిరగబడటానికి ! 

  ఏది ఏమైనా చట్ట బద్ద  పాలనే మన అంతిమ లక్ష్యం కాబట్టి , ఆలేరు ఎన్ కౌంటర్ మీద దర్యాప్తు జరపవలసిమ్డే . అలాగే" రెండు నెల్లల్లో నా కుమారుడు నిర్దోషిగా బయటకు వచ్చే వాడు " అన్న వికారుద్దిన్ తండ్రి గారి మాటలు వెనుక ఉన్న అంతరార్దం ఏమిటో . ఆ దిశగా ఎవరైనా బడా నాయకులు   ప్రాసిక్యూషన్ ని ప్రబావ పరచే ప్రయత్నాలు  చేస్తున్నారా ? అనే దాని పైన కూడా సమగ్ర విచారణ జరుగ వలసిందే . ఎందుకంటె, అరోపిత ఫేక్  ఎన్ కౌంటర్ కి , వికారుడ్డిన్ తండ్రి గారి మాటలకు సంబందం ఉంది . వికారుద్దిన్ నిర్దోషిగా బయట పడడానికి తేర వెనుక ఏదైనా గూడు పుఠాని జరిగితే , అది తెలిసిన పోలిస్ ఆపీసర్లు ఎవరైనా , వికారుద్దిన్ బ్రతికి బయటకు వస్తే , అది అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన తమ సహోద్యోగుల ఆత్మకు అవమానం జరిగినట్లు అని బావించి , అలా జరుగకుండా చుసేందుకే వికారుద్దిన్ ని అతనితో పాటు ఉన్న వారిని చంపారా ? అనే అనుమానం కూడా  కలుగుతుంది . నిజంగా అదే కారణమైతే పోలిసుల చర్యను నైతికంగా తప్పు పట్టవలసిన అవసరం లేదు . ఎందుకంటె పోలిసులు కూడా ఉప్పూ కారం తింటున్న వారే కదా ! వారికి కోపాలు తాపాలు ఉంటాయి . కాకపోతే ఒకటే తేడా . వారి చేతిలో తుపాకులు ఉంటాయి . జనం చేతిలో ఉండవు . అంతే ! మిగతాది అంతా సేమ్ టూ సేమ్ ! 

                          
       చట్టం పని చట్టం చేయాలని కోరుకునే వారు , తమ బాధ్యతలను ఎంత వరకు నెరవేరుస్తున్నారో  ఆత్మ విమర్శ చేసుకోవాలి . తల్లి తండ్రులు. బందువులు  అంటె పుట్టగానే పాలు పట్టడం , చావగానే పాతి  పెట్టడం కాదు. తమ వారు  సక్రమ మార్గం లో నడిచేలా తర్పిడు ఇవ్వాలి కాని, జనం మీద బాంబులు విసిరే తర్పీదులు కోసం విదేశాలు కు వెళుతుంటే  చూస్తూ ఉండకూడదు . ఒక వేళా ఎన్ని చెప్పినా వినకపోతే అలాంటి వారిని వదిలివేయడమే ఉత్తమం .వారి కోసం ఆవేశ పడిపోయి , వారిని హీరోలు చెయ్యడం వివేకం అనిపించుకోదు .  తల్లికి  వంగని వాడు ధాతికి కూడా వంగడు అట .మాతృభూమి మీద ప్రేమ లేని వాడు ఉన్నా ఒకటే  ఉడినా  ఒకటే అని అనుకుంటేనే  మిగతా వారు అయినా  సక్రమ మార్గంలో ఉంటారు . .
                                        (Republished post. OPD: 11/4/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన