ఈ ప్రపంచంలో ఎవరికీ రాని సందేహం ది గ్రేట్ ములాయం సింగ్ యాదవ్ గారికి వచ్చిందట , ఎవరైనా తీరుస్తారా?

                                                                             


ములాయం సింగ్ యాదవ్! సంచలన వ్యాఖ్యలకు మారు పేరు. ఎవరేమి అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా , తనకు  తోచింది, తన మనసులో ఉన్నమాట  అనేసి మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయన చెప్పే విషయాల్లో పాక్షిక వాస్తవాలు ఉన్నప్పటికి , అయన చెప్పే విదానం లో తేడాలు ఉండటం వలన ఆ పాక్షిక వాస్తవాలకు విలువ లేకుండా పోతుంది. అలాంటి వ్యాక్యలే అయన మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమంలో శాంతి భద్రతలు పై మాట్లాడుతూ సందేహం లాంటి ఒక సంచలన వ్యాక్య చేసారు. ఆ వ్యాఖ్య ఏమిటంటె

                               "ఒక స్త్రీ పై నలుగురు సోదరులు అత్యాచారం చేయటం ఎలా సాద్యం అవుతుంది". ? దీని గురించి విశ్లేచించే ముందు ఒక చిన్న కద లాంటిది చెపుతాను.

          ఆ వూరికి సందేహాల్రావు పెద్ద మనిషి . మనిషి తెలివిగలవాడె కాని ఆయనకు వచ్చే ధర్మ సందేహాలకు సరి అయిన సమాదానం చెపితేనే న్యాయం జరుగుతుంది అయన దగ్గర. ఒక రోజు నలుగురు కొడుకులు ఉన్న  తల్లి , తనను కుమారుల దగ్గర్నుంచి సరి అయిన ఆదరణ లబించటం లేదు అని మొర ర పెట్టు కోవటానికి వచ్చింది. కాని సందేహాల్రావు అడిగిన మొదటి ప్రశ్నకే తెల్ల బోయి , ఆయనకు చెప్పటం వేస్ట్ అని వేను  తిరిగింది. " నాకు నలుగురు కొడుకులయ్యా " అని ప్రారంభించబోయిన ఆ తల్లికి  సందేహాల్రావు నుంచి ఎదురైనా ప్రశ్న ఏమిటో తెలుసా?

                           " నీకు ఒకే సారి నలుగురు కొడుకులు పుట్టడం ఎలా సంభవం?
ఈ ప్రశ్నకు,  నలుగురు కొడుకులు అంటే వేరు వేరు సమయాల్లో పుట్టిన  వారు తప్పా , అంతా ఒకే సమయం లో పుట్టిన వారు కాదు" అని తెలియని   ఆ పెద్ద మనిషికి , ఏమి చెప్పినా   వేస్టే అనుకుని వెల్లీ పోయింది. ఇదిగో మొన్న, ఖచ్చితంగా కద లో సందేహాల్రావు కి వచ్చిన డౌట్ లాంటిదే మన ములాయం గారికి వచ్చింది. ఆయనకు కూడా 4 గురు అత్యాచారం చేసారంటే ఎలా సేమ్ టైమ్ లో ఎలా చేస్తారు అని డౌట్ అంట . సేమ్ టైం లో కాదు,  ఒకరి తర్వాత ఒకరు చేసారు అని స్కూల్ పిల్లాడికి చెప్పినట్లు చెప్పాలన్న మాట. ఇటువంటి నాయకులు ముక్య మంత్రులు గా , రాజకీయ నాయకులుగా ఉండటం ప్రజల దురదృష్టం తప్ప మరేమి కాదు. 

                                                       


                                          కాకపోతే అయన చెప్పిన దాంట్లో ఉన్న నిష్టుర సత్యం ఏమిటంటె  కొన్ని కేసులలో బాదితులు కూడా ధన, రాజకీయ  ప్రబావలకు గురి అయి తమ కేసుకు సంబందం లేని  వారిని కూడా ఇరికించటం జరుగుతుంది . దీనితో కేసులు విచారణ కు వచ్చిన సందర్బం లో రాజకీయ వర్గాలు మిలాకత్ అయి చివరకు కేసు వీగిపోయేలా చెయ్యడం, దీనితో సంబందం లేని వ్యక్తులతో పాటు, నేరస్తులు కూడా శిక్ష పడకుండా తప్పించుకోవడం  జరుగుతుంది. దీని గురించి  సరిగ్గా వివరించకుండ , నలుగురు సోదరులు రేప్ ఎలా చేస్తారు అని పిచ్చి ప్రశ్న వేసే సరికి  ములాయం గారు బుక్ అయి పోయారు. ఆయనకు దీని వలన లాబం లేదా అంటే బోల్డంతా పబ్లిసిటి లాబం. 

          యదా ప్రజా !  తదా రాజా ! అదే ప్రజా స్వామ్యం లోని పరమార్దం!

                                        (22/8/2015 Post Republished)



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన